Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా - రాహుల్‌లకు సమన్లు జారీచేసిన ఈడీ

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (14:51 IST)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఎన్‌‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాకిచ్చారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో వీరిద్దరూ తమ ఎదుట గురువారం విచారణకు హాజరుకావాలని ఆ సమన్లలో పేర్కొన్నారు. 
 
ఒకపుడు అత్యంత ప్రజాదారణ పొందిన నేషనల్ హెరాల్డ్ పత్రికను కాంగ్రెస్ పార్టీ నడుపుతూ వచ్చింది. ఆ తర్వాత ఈ పత్రిక ముద్రణను మూసివేసింది. అయితే, ఈ పత్రికకు రాజధాని ఢిల్లీతో సహా అనేక ప్రాంతాల్లో అత్యంత విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిని రాహుల్ గాంధీ తన ఖాతాలో చూపించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి.
 
ఇదే అంశంపై బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ పాటియాల్ హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టుకు సోనియా, రాహుల్ గాంధీలు కోర్టు మెట్లెక్కారు. ఇపుడు ఇదే కేసులో ఈడీ సమన్లు జారీ చేయడం, విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments