Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేఘాలయాలో భూప్రకంపనలు - రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదు

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (08:13 IST)
ఈశాన్య భారతం వరుస భూకంపాలతో వణికిపోతోంది. బుధవారం అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో భూప్రకంపనలు కనిపించాయి. గురువారం మేఘాలయ రాష్ట్రంలో భూకంపం సభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదైంది. 
 
గురువారం తెల్లవారుజామున 3.46 గంటల సమయంలో మేఘాలయ రాష్ట్రంలోని తురాలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఈ ప్రకంపనలు భూకంప లేఖినిపై 3.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. ఈ భూకంప కేంద్రాన్ని తురాకు 37 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్టు తెలిపారు. భూపొరల్లో 5 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపింది. 
 
కాగా, బుధవారం 7 గంటలకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బాసరలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇది రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా ఉంది. అంతకుముందు మహారాష్ట్రలో నాసిక్‌లో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వల్పంగా భూమి  కంపించిన విషయం తెల్సిందే. ఇది రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. 

 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments