Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ - అస్సాం రాష్ట్రాల్లో భూకంపం

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (17:19 IST)
జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో ఆదివారం భూకంపం సంభవించింది. తొలుత జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ జిల్లాలో భూకంపం సంభవించగా ఆ తర్వాత కొద్దిసేపటికే అస్సాంలోని తేజ్‌పూర్‌లో భూమి కంపిపంచింది. దాంతో ఆయనా ప్రాంతాల్లోని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
 
కాగా, సింగ్‌భూమ్‌లో 2.22 గంటలకు, తేజ్‌పూర్‌లో 2.40 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. ఇక అస్సాంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.8 గా నమోదుకాగా, జార్ఖండ్‌లో 4.1 తీవ్రత నమోదైంది. ఈ మేరకు నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకటించింది. ఇవి స్వల్ప ప్రకంపనలే అని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. కాగా, ఈ ఘటనలో ఎలాటి ఆస్తినష్టం గానీ, ప్రాణ నష్టం గానీ సంభవించలేదని అధికారులు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments