Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు నిర్భయ దోషులకు డమ్మీ ఉరి.. ఇసుక బస్తాలతో ట్రయల్స్

Webdunia
బుధవారం, 18 మార్చి 2020 (11:39 IST)
దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార కేసులో దోషులుగా తేలిన నలుగురు ముద్దాయిలకు బుధవారం ఉరి ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ ట్రయల్స్‌ను తలారి నిర్వహించనున్నారు. 
 
కోర్టు ఆదేశాల మేరకు నిర్భయ దోషులను ఈ నెల 20వ తేదీన ఉరి తీసేందుకు జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ కేసులో దోషులైన ముకేష్ సింగ్, అక్షయ్ సింగ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలకు ఉరి తీసేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సెంట్రల్ జైలు నుంచి తలారీ ఢిల్లీలోని తిహార్ జైలుకు వచ్చారు. 
 
నిర్భయ దోషుల ఉరికి ముందు వారి బరువును బట్టి ఇసుక బస్తాలతో తిహార్ జైలు గదిలో బుధవారం డమ్మీ ఉరి కార్యక్రమాన్ని జైలు అధికారులు చేపట్టారు. ఒక వైపు నిర్భయ దోషుల ఉరికి తిహార్ జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 
 
మరోవైపు, నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ కుమార్ గుప్తా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యాచార ఘటన జరిగినపుడు తాను మైనర్‌నని, అందుకే తన ఉరిని రద్దు చేసి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని పవన్ కుమార్ గుప్తా కోరాడు. 
 
అలాగే, మరో దోషి అక్షయ్ తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని జైలు అధికారులకు రెండోసారి పిటిషన్ సమర్పించాడు. జైలు అధికారులు దీన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments