Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన సైనికుడు!

వరుణ్
శనివారం, 15 జూన్ 2024 (12:32 IST)
పీకల వరకు తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై  ఓ సైనికుడు మూత్రవిసర్జన చేశాడు. హజ్రత్ నిజాముద్దీన్ నుంచి దుర్గ్ వెళుతున్న గోండ్వాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. పైనున్న బెర్త్‌పై మూత్ర విసర్జన చేయడంతో కిందనున్న మహిళపై పడింది. ఈ ఘటనపై బాధితురాలు ఆర్పీఎఫ్‌ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించలేదు. దీంతో ఆమె ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే మంత్రికి ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందిన బాధిత మహిళ తన కుమారుడు, భర్తతో కలిసి బీ-9 కోచ్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. పై బెర్తులో ఉన్న జవాను మూత్ర విసర్జన చేయడంతో అది మహిళపై పడింది. ఆ వెంటనే ఆమె తన భర్తకు చెబితే ఆయన 139 హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. గ్వాలియర్, ఝాన్సీ స్టేషన్లలో ఆర్పీఎఫ్ సిబ్బంది రైలు ఎక్కినప్పటికీ జవానుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
 
దీంతో ఆమె ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే మంత్రికి ఫిర్యాదు చేశారు. అయితే, ఆర్పీఎఫ్ అధికారులు మాత్రం తాము స్పందించామని, బాధిత మహిళ తన సీట్లో కనిపించలేదని పేర్కొన్నారు. సైనికుడు మాత్రం పూర్తిగా తాగిన మత్తులో నిద్రపోతున్నాడని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments