Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో జడుసుకుంటుంటే.. కాటేసిన పామును కవర్‌లో వేసుకొచ్చాడు..

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (11:27 IST)
అసలే కరోనాతో జనాలు జడుసుకుంటుంటే.. కొందరు మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తూ.. జనాలను ఇంకా జడుసుకునేలా చేస్తున్నారు. తమిళనాడు కోయంబత్తూరులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కాటేసిన పామును ప్రాణాలతో ఆస్పత్రికి తీసుకొచ్చిన యువకుడిని చూసి వైద్యులు, సిబ్బంది దిగ్ర్భాంతి చెందారు. 
 
వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూర్‌ సింగానల్లూర్‌ కన్నిమేడు ప్రాంతానికి చెందిన సౌందర్‌రాజన్‌ పెయింటర్‌. ఆయన గురువారం రాత్రి శౌరిపాళయంలోని తన స్నేహితుడి ఇంటికి రాగా, పక్క ఇంట్లో పాము ఉన్నట్లు చుట్టుపక్కల వారు కేకలు వేశారు. మద్యం మత్తులో ఉన్న సౌందర్‌రాజన్‌ ఇంట్లోకి వెళ్లి చూసి, మూలన ఉన్న నాగుపామును పట్టుకోవడంతో అది అతని చేతిపై కాటు వేసింది.
 
పామును ఓ ప్లాస్టిక్‌ బ్యాగులో ఉంచి సౌందర్‌రాజన్‌ నేరుగా వచ్చి వైద్యసిబ్బంది బ్యాగు నుంచి పామును వెలుపలికి తీసి చూపించి మళ్లీ దానిని బ్యాగులో ఉంచి సెక్యూరిటీ గార్డుకు అందజేశాడు. గార్డ్‌ దానిని అటవీ శాఖ సిబ్బందికి అందజేశారు. సౌందర్‌రాజన్‌కు వైద్యులు చికిత్సలు అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments