Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో జడుసుకుంటుంటే.. కాటేసిన పామును కవర్‌లో వేసుకొచ్చాడు..

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (11:27 IST)
అసలే కరోనాతో జనాలు జడుసుకుంటుంటే.. కొందరు మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తూ.. జనాలను ఇంకా జడుసుకునేలా చేస్తున్నారు. తమిళనాడు కోయంబత్తూరులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కాటేసిన పామును ప్రాణాలతో ఆస్పత్రికి తీసుకొచ్చిన యువకుడిని చూసి వైద్యులు, సిబ్బంది దిగ్ర్భాంతి చెందారు. 
 
వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూర్‌ సింగానల్లూర్‌ కన్నిమేడు ప్రాంతానికి చెందిన సౌందర్‌రాజన్‌ పెయింటర్‌. ఆయన గురువారం రాత్రి శౌరిపాళయంలోని తన స్నేహితుడి ఇంటికి రాగా, పక్క ఇంట్లో పాము ఉన్నట్లు చుట్టుపక్కల వారు కేకలు వేశారు. మద్యం మత్తులో ఉన్న సౌందర్‌రాజన్‌ ఇంట్లోకి వెళ్లి చూసి, మూలన ఉన్న నాగుపామును పట్టుకోవడంతో అది అతని చేతిపై కాటు వేసింది.
 
పామును ఓ ప్లాస్టిక్‌ బ్యాగులో ఉంచి సౌందర్‌రాజన్‌ నేరుగా వచ్చి వైద్యసిబ్బంది బ్యాగు నుంచి పామును వెలుపలికి తీసి చూపించి మళ్లీ దానిని బ్యాగులో ఉంచి సెక్యూరిటీ గార్డుకు అందజేశాడు. గార్డ్‌ దానిని అటవీ శాఖ సిబ్బందికి అందజేశారు. సౌందర్‌రాజన్‌కు వైద్యులు చికిత్సలు అందించారు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments