మావోయిస్టులపై డ్రోన్‌తో బాంబుల దాడి?

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (16:27 IST)
తమను అణచివేసే లక్ష్యంతో భద్రత బలగాలు తొలిసారిగా డ్రోన్‌తో బాంబులు వేశాయని మావోయిస్టులు ఆరోపించగా.. దీన్ని పోలీసులు ఖండించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇటీవల జరిగిన ఓ ఘటనపై మావోయిస్టు దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప పేరిట మీడియాకు బుధవారం ఓ లేఖ విడుదల చేశారు. 
 
బొత్తలంక, పాలగూడెం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో ఈ నెల 19 తెల్లవారుజామున పోలీసులు డ్రోన్‌తో 12 బాంబులను అడవిలో వదిలారని లేఖలో ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు. డ్రోన్‌ సహాయంతో బాంబుల దాడి ఆరోపణల్లో నిజం లేదని బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ ఖండించారు.
 
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా సోన్పూర్‌-కుందల అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో ఐటీబీపీ (ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌) జవాను సునీల్‌సింగ్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై అపహరణబీజాపుర్‌ జిల్లా పలనార్‌లో ఓ ఎస్సైని బుధవారం మావోయిస్టులు అపహరించారు. 
 
జగదల్‌పూర్‌లో ఎస్సైగా పనిచేస్తున్న మురళీ ఇటీవల సెలవుపై పెట్టి స్వగ్రామమైన పలనార్‌కు వచ్చారు. సాయంత్రం సమయంలో ఆయన అపహరణకు గురైనట్లు ఎస్పీ కమలోచన్‌ కశ్యప్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Parthiban ఫ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో హరీష్ శంకర్ కు గిఫ్ట్ ఇచ్చిన పార్థిబన్

Bigg Boss Telugu 9- బిగ్ బాస్ తెలుగు 9 : ఈ వారం ఎలిమినేషన్ వుండదా?

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments