Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి మూలాలు ఎక్కడ? కాంగ్రెస్‌పై అమరీందర్ ఫైర్

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (11:56 IST)
కాంగ్రెస్ పార్టీపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మరోమారు తీవ్ర విమర్శలు గుప్పించారు. సెక్యులరిజం గురించి మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని హితవు పలికారు. 
 
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి, నానా పటోలే వంటి నాయకులు ఆరెస్సెస్ నుంచి వచ్చారన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. బీజేపీ నుంచి వచ్చిన సిద్ధూను నెత్తిన పెట్టుకున్నారని, మహారాష్ట్రలో శివసేనతో జట్టు కట్టారంటూ దెప్పిపొడిచారు. 
 
పంజాబ్‌లో కొత్త పార్టీ పెట్టి బీజేపీతో పొత్తు అంశంపై పరిశీలిస్తామని ఇటీవల అమరీందర్ ఓ ప్రకటన చేసిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. ఆ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావత్ మాట్లాడుతూ తనలోని సెక్యులర్ అమరీందర్‌ను ఆయన చంపుకొన్నారన్నారు. 
 
ఈ వ్యాఖ్యలకు ప్రతిగా అమరీందర్ కాంగ్రెస్‌పై ఇలా విరుచుకుపడ్డారు. మరోవైపు, పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగుచట్టాల నిర్మాత అమరీందరేనని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే ఆయన తిరుగుబాటు బావుటా ఎగురవేసి ఆ పార్టీతో జతకట్టేందుకు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments