Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి అద్దెలు అడగొద్దు.. ఢిల్లీ సీఎం విజ్ఞప్తి

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (07:47 IST)
కరోనా వైరస్ దెబ్బకు భారత్ మొత్తం లాక్ డౌన్ అయింది. అన్ని కంపెనీలు మూతపడ్డాయి. జనాలు ఇళ్లకు మాత్రమే పరిమితమయ్యారు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండగా.. మరికొందరికి ఉపాధులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక పేదవాళ్ళ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వాళ్లు రోజూ పనికి వెళ్తేనే ఇళ్లు గడుస్తుంది. అలాంటి వారికి కోసం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఇళ్లు అద్దెకు ఇచ్చిన యజమానులకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. అద్దెకు ఉంటున్న వారిని ఓనర్లు రెంట్ కోసం వేధించవద్దు అని ఆయన కోరారు.

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు ఇచ్చాయి. ఈ క్రమంలోనే యజమానులు ఇళ్లలో అద్దెకు ఉంటున్న వారి దగ్గర నుంచి బలవంతంగా అద్దె వసూలు చేయొద్దని సూచించారు.

ఒకటి లేదా రెండు నెలల్లో ఇచ్చేస్తారని.. లేదా వాయిదాల రూపంలో వసూలు చేసుకుని పేదవారిని ఆదుకోవాలని కేజ్రివాల్ కోరారు. రాష్ట్రంలో ఎవరూ కూడా ఆకలితో బాధపడకుండా చూడాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments