Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలను ప్రేమించండి... గుడ్డిగా మాత్రం నమ్మకండి!: 'రేమాండ్' బాస్ వినతి

కొడుకు చేతిలో మోసపోయి రోడ్డున పడిన రేమాండ్ కంపెనీ వ్యవస్థాపక అధినేత విజయ్ పథ్ సింఘానియా దేశంలోని తల్లిదండ్రులకు ఓ విజ్ఞప్తి చేశారు. పిల్లలను ప్రేమించండి... గుడ్డిగా మాత్రం నమ్మకండి అంటూ పిలుపునిచ్చారు

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (10:23 IST)
కొడుకు చేతిలో మోసపోయి రోడ్డున పడిన రేమాండ్ కంపెనీ వ్యవస్థాపక అధినేత విజయ్ పథ్ సింఘానియా దేశంలోని తల్లిదండ్రులకు ఓ విజ్ఞప్తి చేశారు. పిల్లలను ప్రేమించండి... గుడ్డిగా మాత్రం నమ్మకండి అంటూ పిలుపునిచ్చారు. 
 
ప్రస్తుతం ఈయన తన పుత్రరత్నాలను నమ్మి వారికి సర్వస్వమూ అప్పగించి, ఇప్పుడు కనీస నీడ లేక, కోర్టులో పోరాడుతున్న విషయం తెల్సిందే. ఈయన తల్లిదండ్రులకు ఓ సలహా ఇచ్చారు. తన కుమారుడు గౌతమ్ సింఘానియాకు రేమాండ్‌లో రూ.1000 కోట్ల విలువైన తన వాటానంతా ఇచ్చి, ఇప్పుడు తన జీవితం గడిచేందుకు అవస్థలు పడుతున్నారు."మీ పిల్లలను ప్రేమించండి. వారి ఆలనా పాలనా చూడండి. అయితే, గుడ్డిగా మాత్రం నమ్మవద్దు" అంటున్నారు.
 
తన 79 ఏళ్ల జీవితంలో, కుటుంబంలో విభేదాలను కోర్టు వరకూ తీసుకు వెళతానని ఎన్నడూ భావించలేదని అన్నారు. తనకున్నదంతా బిడ్డకు ఇచ్చేసి నిలువ నీడలేని వాడినయ్యానని, ఈ పరిస్థితి మరే తల్లిదండ్రులకూ రాకూడదని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా, తన పోషణ నిమిత్తం నెలకు రూ.7 లక్షలు ఇవ్వాలని విజయ్ పథ్ సింఘానియా కుమారుడిపై న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ కేసులో సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బాంబే హైకోర్టు గత వారంలో కోరింది. తండ్రిని గౌరవంగా చూసుకోవడం బాధ్యతని గౌతమ్‌కు సూచించింది. కాగా, తానేం చేస్తున్నానన్న విషయంలో తనకు స్పష్టత ఉందని, తాను తప్పేమీ చేయడం లేదని గౌతమ్ సింఘానియా వ్యాఖ్యానించడం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments