Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలను ప్రేమించండి... గుడ్డిగా మాత్రం నమ్మకండి!: 'రేమాండ్' బాస్ వినతి

కొడుకు చేతిలో మోసపోయి రోడ్డున పడిన రేమాండ్ కంపెనీ వ్యవస్థాపక అధినేత విజయ్ పథ్ సింఘానియా దేశంలోని తల్లిదండ్రులకు ఓ విజ్ఞప్తి చేశారు. పిల్లలను ప్రేమించండి... గుడ్డిగా మాత్రం నమ్మకండి అంటూ పిలుపునిచ్చారు

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (10:23 IST)
కొడుకు చేతిలో మోసపోయి రోడ్డున పడిన రేమాండ్ కంపెనీ వ్యవస్థాపక అధినేత విజయ్ పథ్ సింఘానియా దేశంలోని తల్లిదండ్రులకు ఓ విజ్ఞప్తి చేశారు. పిల్లలను ప్రేమించండి... గుడ్డిగా మాత్రం నమ్మకండి అంటూ పిలుపునిచ్చారు. 
 
ప్రస్తుతం ఈయన తన పుత్రరత్నాలను నమ్మి వారికి సర్వస్వమూ అప్పగించి, ఇప్పుడు కనీస నీడ లేక, కోర్టులో పోరాడుతున్న విషయం తెల్సిందే. ఈయన తల్లిదండ్రులకు ఓ సలహా ఇచ్చారు. తన కుమారుడు గౌతమ్ సింఘానియాకు రేమాండ్‌లో రూ.1000 కోట్ల విలువైన తన వాటానంతా ఇచ్చి, ఇప్పుడు తన జీవితం గడిచేందుకు అవస్థలు పడుతున్నారు."మీ పిల్లలను ప్రేమించండి. వారి ఆలనా పాలనా చూడండి. అయితే, గుడ్డిగా మాత్రం నమ్మవద్దు" అంటున్నారు.
 
తన 79 ఏళ్ల జీవితంలో, కుటుంబంలో విభేదాలను కోర్టు వరకూ తీసుకు వెళతానని ఎన్నడూ భావించలేదని అన్నారు. తనకున్నదంతా బిడ్డకు ఇచ్చేసి నిలువ నీడలేని వాడినయ్యానని, ఈ పరిస్థితి మరే తల్లిదండ్రులకూ రాకూడదని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా, తన పోషణ నిమిత్తం నెలకు రూ.7 లక్షలు ఇవ్వాలని విజయ్ పథ్ సింఘానియా కుమారుడిపై న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ కేసులో సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బాంబే హైకోర్టు గత వారంలో కోరింది. తండ్రిని గౌరవంగా చూసుకోవడం బాధ్యతని గౌతమ్‌కు సూచించింది. కాగా, తానేం చేస్తున్నానన్న విషయంలో తనకు స్పష్టత ఉందని, తాను తప్పేమీ చేయడం లేదని గౌతమ్ సింఘానియా వ్యాఖ్యానించడం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments