Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు బాబులకు పిల్లను ఇవ్వొద్దు.. కేంద్ర మంత్రి కౌశల్ వినతి

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2022 (16:50 IST)
ఆడ పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ ఓ విజ్ఞప్తి చేశారు. మద్యం బాబులకు పిల్లను ఇవ్వొద్దని కోరారు. మద్యానికి అలవాటుపడిన తన కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని, ఇపుడు అతని భార్య ఏకాకిగా మిగిలిందన్న ఆవేదనను వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదని ఆయన కోరారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ తాను ఎంపీగా, తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా మద్యానికి అలవాటుపడిన తన కుమారుడి ప్రాణాలు కాపాడుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని డీ అడిక్షన్ కేంద్రంలో కూడా చేర్పించామని, ఆ అలవాటును మానేస్తాడనే అనుకున్నామని, ఆ తర్వాత ఆరు నెలలకు పెళ్లి చేసుకున్నాడని చెప్పారు. 
 
కానీ, మళ్లీ తాగుడుకు అలవాటుపడిన ఆయన చివరకు రెండేళ్ల క్రితం చనిపోయాడని తెలిపారు. అతను చనిపోయేటపుడు అతని కుమారుడికి రెండేళ్ల వయస్సు మాత్రమేనని చెప్పారు. అతని భార్య ఒంటరిదైనందన్నారు. ఇలాంటి పరిస్థితి ఏ ఒక్కరికీ రాకూడదన్నారు. మద్యానికి బానిసైన అధికారి కంటే ఒక కూలీ లేదా రిక్షా కార్మికుడిని పెళ్లికొడుకుగా ఎంపిక చేయడం మంచిదని అన్నారు. 
 
మీ కూతుర్లను, అక్క చెల్లెళ్లను కాపాడుకోవాలని తెలిపారు. మద్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా యేటా 20 లక్షల మంది మరణిస్తున్నారని తెలిపారు. మద్యానికి అలవాటైనవారి జీవితకాలం చాలా తక్కువ అని చెప్పారు. విద్యార్థి దశలోనే దీనిపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments