Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు బాబులకు పిల్లను ఇవ్వొద్దు.. కేంద్ర మంత్రి కౌశల్ వినతి

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2022 (16:50 IST)
ఆడ పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ ఓ విజ్ఞప్తి చేశారు. మద్యం బాబులకు పిల్లను ఇవ్వొద్దని కోరారు. మద్యానికి అలవాటుపడిన తన కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని, ఇపుడు అతని భార్య ఏకాకిగా మిగిలిందన్న ఆవేదనను వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదని ఆయన కోరారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ తాను ఎంపీగా, తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా మద్యానికి అలవాటుపడిన తన కుమారుడి ప్రాణాలు కాపాడుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని డీ అడిక్షన్ కేంద్రంలో కూడా చేర్పించామని, ఆ అలవాటును మానేస్తాడనే అనుకున్నామని, ఆ తర్వాత ఆరు నెలలకు పెళ్లి చేసుకున్నాడని చెప్పారు. 
 
కానీ, మళ్లీ తాగుడుకు అలవాటుపడిన ఆయన చివరకు రెండేళ్ల క్రితం చనిపోయాడని తెలిపారు. అతను చనిపోయేటపుడు అతని కుమారుడికి రెండేళ్ల వయస్సు మాత్రమేనని చెప్పారు. అతని భార్య ఒంటరిదైనందన్నారు. ఇలాంటి పరిస్థితి ఏ ఒక్కరికీ రాకూడదన్నారు. మద్యానికి బానిసైన అధికారి కంటే ఒక కూలీ లేదా రిక్షా కార్మికుడిని పెళ్లికొడుకుగా ఎంపిక చేయడం మంచిదని అన్నారు. 
 
మీ కూతుర్లను, అక్క చెల్లెళ్లను కాపాడుకోవాలని తెలిపారు. మద్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా యేటా 20 లక్షల మంది మరణిస్తున్నారని తెలిపారు. మద్యానికి అలవాటైనవారి జీవితకాలం చాలా తక్కువ అని చెప్పారు. విద్యార్థి దశలోనే దీనిపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments