Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చి.. మహిళా వైద్యురాలిపై అత్యాచారం

Webdunia
గురువారం, 1 జులై 2021 (18:44 IST)
ఒడిశాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం జరిగిన దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి.. మహిళా వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉన్న వైద్యురాలిపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన.. ఒడిశాలోని అంగూల్ జిల్లాలో జరిగింది. 
 
అంగూల్ జిల్లాలోని చెండిపద ఏరియా ఆసుపత్రిలో ఓ మహిళ డాక్టర్‌గా పనిచేస్తోంది. ఆమెకు కేటాయించిన ప్రభుత్వ కార్వర్ట్స్‌లో తన సోదరుడితో కలిసి ఉంటోంది. అయితే మంగళవారం రాత్రి ఆమె సోదరుడు తన స్నేహితులతో కలిసి సమీపంలోని దాబాకు డిన్నర్‌కు వెళ్లాడు. దాబాలో భోజనం చేస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న సోదరి కోసం ఫుడ్‌ పార్శిల్‌ పంపాడు. అనంతరం ఆ ఫుడ్ పార్శిల్‌ను తీసుకొని దాబా యజమాని కుమారుడు.. మహిళా డాక్టర్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లాడు.
 
ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై దాబా యజమాని కుమారుడు బెహరా అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. సోదరుడు ఇంటికి రాగానే.. మహిళా వైద్యురాలు జరిగిన విషయాన్ని చెప్పింది. అనంతరం ఈ ఘటనపై మహిళా డాక్టర్, ఆమె సోదరుడు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బెహరాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు అంగూల్ జిల్లా పోలీసులు తెలిపారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments