Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో డీఎంకే ఎంపీ కుమారుడు దుర్మరణం

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (12:32 IST)
తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అధికార డీఎంకేకు చెందిన రాజ్యసభ సభ్యుడు ఎన్.ఆర్. ఇళంగోవన్ కుమారుడు రాకేష్ (22)తో పాటు మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వీరిద్దరూ పుదుచ్చేరి నుంచి చెన్నైకు వెళుతుండగా, గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. అమిత వేగంతో వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌‍ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాకేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆయనతో కలిసి ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో కారును పక్కకు తొలగించి వాహనరాకపోకలను పునరుద్ధరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇళంగోవన్ రాజ్యసభలో డీఎంకే తరపున గత 2020 నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments