Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో డీఎంకే ఎంపీ కుమారుడు దుర్మరణం

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (12:32 IST)
తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అధికార డీఎంకేకు చెందిన రాజ్యసభ సభ్యుడు ఎన్.ఆర్. ఇళంగోవన్ కుమారుడు రాకేష్ (22)తో పాటు మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వీరిద్దరూ పుదుచ్చేరి నుంచి చెన్నైకు వెళుతుండగా, గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. అమిత వేగంతో వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌‍ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాకేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆయనతో కలిసి ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో కారును పక్కకు తొలగించి వాహనరాకపోకలను పునరుద్ధరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇళంగోవన్ రాజ్యసభలో డీఎంకే తరపున గత 2020 నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

పవన్‌ కల్యాన్‌ వల్ల డొక్కా సీతమ్మ అందరికీ తెలిసింది : బాలినేని శ్రీనివాసరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments