Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెనుకబడిన రాష్ట్రాల ప్రజలు మాట్లాడే భాష హిందీ : డీఎంకే ఎంపీ

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (10:59 IST)
దేశంలో ఉత్తర, దక్షిణాది చర్చ జరుగుతోంది. మరోవైపు, ప్రతి ఒక్కరూ హిందీ నేర్చుకోవాలంటూ కేంద్రంలోని బీజేపీ పాలకులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో దేశంలో హిందీ వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇళంగోవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ వెనుకబడిన రాష్ట్రాల భాష అంటూ వ్యాఖ్యానించారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనే హిందీ ఎక్కువగా మాట్లాడుతారని ఆయన చెప్పారు. ఈ రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో బాగా వెనుకబడివున్నాయని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, "వెస్ట్ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలను చూడండి.. ఇవన్నీ అభివృద్ధి చెందిన రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల ప్రజలకు హిందీ మాతృభాష కాదు" అని వివరించారు. 
 
అంతేకాదు, హిందీ మనల్ని శూద్రుల్లా మార్చేస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందువల్ల హిందీని స్వీకరించడం ఏమాత్రం మంచిదికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments