Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవత్వమా.. ఏదీ నీ చిరునామా? కూతురి శవంతో 4 కి.మీ.లు నడక (Video)

ప్రస్తుత సమాజంలో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. మనిషి ప్రాణాలు పోతున్నా… సాటి మనుషులు కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా కళ్లెదుటే పలువురు తిరిగిరానిలోకాలకు చేరుకుంటున్నారు. ఇలాంటి సం

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2017 (11:22 IST)
ప్రస్తుత సమాజంలో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. మనిషి ప్రాణాలు పోతున్నా… సాటి మనుషులు కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా కళ్లెదుటే పలువురు తిరిగిరానిలోకాలకు చేరుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి బీహార్ రాష్ట్రంలో జరిగింది. అదీ కూడా ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలోని అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్‌ ఆసుపత్రిలో ఈ దారుణం జరిగింది. 
 
ఓపీ కార్డు సమయానికి అందక.. ఓ చిన్నారి(9) ప్రాణాలు కోల్పోయింది. చివరికి ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లేందుకూ అంబులెన్స్‌ ఇవ్వడానికి కూడా హాస్పిటల్ సిబ్బందికి మనసొప్పలేదు. దీంతో వేరే గతిలేక ఆ తండ్రి తన కుమార్తె శవాన్ని 4 కిలోమీటర్ల పాటు భుజాన మోసుకుంటూ వెళ్లాడు.
 
ఈ వివరాల్లోకి వెళితే… లక్షిసరై జిల్లా కజ్రా గ్రామానికి చెందిన రామ్‌ బాలక్‌ దంపతుల కుమార్తె రౌషణ్‌ కుమారి ఆరు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో మంగళవారం ఎయిమ్స్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడి సిబ్బంది తొలుత ఔట్‌ పేషంట్‌(ఓపీ)కార్డు తేవాలని చెప్పారు. నిరుపేద కూలి అయిన రామ్‌ బాలక్‌ ఓపీ కార్డు కోసం యత్నిస్తుండగా.. కుమార్తె విషమిమించింది. 
 
ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బందికి చెప్పినావారు ఏమాత్రం పట్టించుకోలేదు. ఓపీ కార్డు తెస్తేనే చికిత్స ప్రారంభిస్తామని తేల్చి చెప్పారు. చివరికి ఓపీ కార్డు తీసుకుని వచ్చేసరికి రోషణ్‌ కుమారి ప్రాణాలు కోల్పోయింది.
 
దీంతో ఆ తల్లిదండ్రులు కుమార్తె శవంముందు కూలబడిపోయి బోరున విలవించారు. ఆ తర్వాత చేసేదేం లేక కుమార్తె శవాన్ని ఇంటికి తీసుకువెళ్లడానికి అంబులెన్స్ సమకూర్చాలని కోరారు. అయినా.. ఆస్పత్రి సిబ్బందికి మనసొప్పలేదు. దీంతో చేసేది లేక.. తానే భుజంపై వేసుకుని… 4 కిమీ.లు నడిచి ఇంటికి తీసుకెళ్లి, అంత్యక్రియలు పూర్తి చేశారు ఆ తల్లిదండ్రులు. ఈ ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పందించక పోవడం గమనార్హం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments