Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లీ, చెల్లెలు వ్యభిచారం చేస్తున్నారని... కొడుకు ఏం చేశాడంటే...

ఢిల్లీలో దారుణం జరిగింది. తల్లీ, చెల్లెలు వ్యభిచారం చేస్తున్నారన్న కోపంతో పరువు కోసం 21 ఏళ్ల కొడుకు వారిని తుపాకీతో కాల్చి చంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (09:26 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. తల్లీ, చెల్లెలు వ్యభిచారం చేస్తున్నారన్న కోపంతో పరువు కోసం 21 ఏళ్ల కొడుకు వారిని తుపాకీతో కాల్చి చంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీ నజాఫ్‌ఘడ్ పరిధిలోని ప్రేమ్‌నగర్‌లో ఓ తల్లితో పాటు.. కుమార్తె, కుమారుడు నివశిస్తున్నారు. వీరిలో తల్లి సునీతకు 40 ఏళ్లు, కుమార్తెకు 15 యేళ్లు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన కుమారుడు.. తమ కుటుంబ పరువు తీస్తున్నాడని భావించారు. అంతే... తన ఇద్దరు స్నేహితులతో కలిసి పథకం పన్ని హతమార్చాడు. 
 
సునీత కుమారుడైన సుమీత్ తన ఇద్దరు స్నేహితులైన ధర్మాబీర్ (28), ప్రదీప్ (15)లతో కలిసి తల్లీ, చెల్లిని చంపాడని పోలీసులు చెప్పారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సునీతతోపాటు ఆమె కూతురిని రాజస్థాన్ రాష్ట్రంలోని సికర్‌లో ఉన్న ఖటుశ్యాం దేవాలయ సందర్శనకు ధర్మాబీర్ తన కారులో తీసుకువచ్చాడు. 
 
అక్కడికి సమీపంలోని మానేసర్ లోని ఇండస్ట్రియల్ మోడల్ టౌన్ షిప్ ప్రాంతంలో తల్లీ కూతుళ్లను ముగ్గురు యువకులు కలిసి వారికి దుపట్టా చుట్టి దేశీ తుపాకులతో కాల్చి చంపారు. వారి మృతదేహాలను మైదానంలో పడేసి ఏమీ ఎరగనట్లు ఢిల్లీకి తిరిగివచ్చారు. పోలీసులు అనుమానంతో సుమిత్ ను పట్టుకొని ప్రశ్నిస్తే అసలు హత్య విషయం వెలుగు చూసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నువ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

బ్రెయిన్ ఎన్యోరిజమ్‌ సమస్యతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్!! (Video)

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments