Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవు కళేబరాన్ని తీసేందుకు నిరాకరించిన దళిత గర్భిణీపై అగ్రకులస్తుల దాడి...

గుజరాత్ రాష్ట్రంలో మరోమారు అగ్రకుల దురాహంకారం బయటపడింది. తమ పొలంలో చనిపోయిన గోవు కళేబరాన్ని తొలగించేందుకురాని దళిత దంపతులపై అగ్రకులస్తులు దాడిచేశారు. ఈ దాడిలో నిండు గర్భిణి తీవ్రంగా గాయపడింది. తాజాగా

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (08:55 IST)
గుజరాత్ రాష్ట్రంలో మరోమారు అగ్రకుల దురాహంకారం బయటపడింది. తమ పొలంలో చనిపోయిన గోవు కళేబరాన్ని తొలగించేందుకురాని దళిత దంపతులపై అగ్రకులస్తులు దాడిచేశారు. ఈ దాడిలో నిండు గర్భిణి తీవ్రంగా గాయపడింది. తాజాగా వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
గుజరాత్ రాష్ట్రంలోని బనస్కంత జిల్లాలోని అమిర్‌గఢ్ తాలుగా కర్జా అనే గ్రామంలో సంగీత రణవాసియా (25), నిలేశ్ రనవాసియా అనే ఇద్దరు భార్యభర్తలు. వీరిద్దరు దళిత కులానికి చెందినవారు. 
 
అయితే, ఇదే గ్రామంలో దర్బార్ అనే కమ్యూనిటికీ చెందిన అగ్రకులస్తుల పొలంలో గోవు చనిపోయింది. ఆ కళేబరాన్ని తొలగించేందుకు రావాలని దళిత దంపతులను అగ్రకులస్తులు కోరారు. ఇప్పుడు తాము ఆ పనిచేయడం లేదని, అందువల్ల కళేబరాన్ని తొలగించలేమని బదులిచ్చారు. 
 
తాము చెప్పిన మాట వినవా అంటూ ఓ పదిమంది నీలేశ్‌పై దాడి చేస్తుండగా ఐదునెలల గర్భవతి అయిన సంగీత అడ్డుకోబోయింది. దీంతో ఆమెతో పాటు.. అడ్డొచ్చిన మరో ఆరుగురిపైన కూడా దాడి చేశారు. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు కేసులు నమోదుచేసి దాడికి బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకున్నారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం