హస్తినలో మరో మంకీపాక్స్ కేసు.. 22 యేళ్ల యువతికి పాజిటివ్

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (18:52 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. 22 యేళ్ళ యువతికి ఈ వైరస్ పాజిటివ్‌‌గా తేలింది. ఇటీవల ఆఫ్రికా దేశమైన నైజీరియా నుంచి వచ్చిన 22 యేళ్ల యువతికి ఆరోగ్యం బాగోలేకపోవడం, చర్మంపై దద్దుర్లు రావడంతో ఆస్పత్రిలో చేరింది. ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌కు జరిపిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. 
 
ఈ బాధితురాలు నైజీరియా దేశానికి చెందిన యుతే. ఆమె అక్కడ నుంచి భారత్‌కు వచ్చే ముందే మంకీపాక్స్ వైరస్ సోకివుంటుందని ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈమె అనారోగ్యం బారినపడటంతో ఢిల్లీలోని ఎల్.ఎన్.జె.పి. ఆస్పత్రిలో చేరి చికిత్స అందిస్తూ వచ్చారు. 
 
ఇదిలావుంటే, పాజిటివ్ వచ్చిన నైజీరియా యువతితో కలిపి ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన మంకీ పాక్స్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. వీరిలో ఇద్దరు మహిళలుకాగా, ముగ్గురు పురుషులు. ఇందులో ఒక వ్యక్తి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిపోయారని.. మిగతా నలుగురు ఎల్ఎన్ జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Parthiban ఫ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో హరీష్ శంకర్ కు గిఫ్ట్ ఇచ్చిన పార్థిబన్

Bigg Boss Telugu 9- బిగ్ బాస్ తెలుగు 9 : ఈ వారం ఎలిమినేషన్ వుండదా?

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments