Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన ఎమ్మెల్యే కాదు.. ఓ రేపిస్ట్ : దోషిగా బీజేపీ నేత నిర్ధారణ

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (10:50 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచార కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. ఆయన్ను ఓ రేపిస్ట్‌గా కోర్టు అభివర్ణించింది. సమాజంలో పలుకుబడిగల వ్యక్తి (ఎమ్మెల్యే)కి వ్యతిరేకంగా పోరాడేందుకు బాధితురాలు కొంత సమయం తీసుకున్నదని, ఆమె ఇచ్చిన వాంగ్మూలం సత్యమైనదని కోర్టు వ్యాఖ్యానించింది. 
 
పైగా, ఈ కేసు విచారణలో కూడా సీబీఐ అధికారులు తీవ్రమైన ఒత్తిడి కారణంగా అనేక నిబంధనలను యధేచ్చగా ఉల్లింఘించారంటూ న్యాయమూర్తి మండిపడ్డారు. ముఖ్యంగా, ఈ కేసులో చార్జిషీటు దాఖలులో జాప్యం చేయడం, దర్యాప్తు సమయంలో అధికారి లేకపోవడంపై కోర్టు విస్మయం వ్యక్తంచేసింది. 
 
పోక్సో చట్టంలో లోపంలేదని, అధికారుల అసమర్థత, అమానవీయ దృక్పథం వల్లనే బాధితులకు న్యాయం ఆలస్యంగా అందుతున్నదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో మరో నిందితుడు శశిసింగ్‌ను నిర్దోషిగా విడుదల చేసిన కోర్టు.. దోషిగా ఖరారైన కుల్దీప్ సెంగార్‌కు విధించాల్సిన శిక్షపై బుధవారం విచారణ జరుపనుంది. ఉన్నావ్ లైంగికదాడి కేసుతో సంబంధమున్న మరో నాలుగు కేసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments