Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన ఎమ్మెల్యే కాదు.. ఓ రేపిస్ట్ : దోషిగా బీజేపీ నేత నిర్ధారణ

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (10:50 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచార కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. ఆయన్ను ఓ రేపిస్ట్‌గా కోర్టు అభివర్ణించింది. సమాజంలో పలుకుబడిగల వ్యక్తి (ఎమ్మెల్యే)కి వ్యతిరేకంగా పోరాడేందుకు బాధితురాలు కొంత సమయం తీసుకున్నదని, ఆమె ఇచ్చిన వాంగ్మూలం సత్యమైనదని కోర్టు వ్యాఖ్యానించింది. 
 
పైగా, ఈ కేసు విచారణలో కూడా సీబీఐ అధికారులు తీవ్రమైన ఒత్తిడి కారణంగా అనేక నిబంధనలను యధేచ్చగా ఉల్లింఘించారంటూ న్యాయమూర్తి మండిపడ్డారు. ముఖ్యంగా, ఈ కేసులో చార్జిషీటు దాఖలులో జాప్యం చేయడం, దర్యాప్తు సమయంలో అధికారి లేకపోవడంపై కోర్టు విస్మయం వ్యక్తంచేసింది. 
 
పోక్సో చట్టంలో లోపంలేదని, అధికారుల అసమర్థత, అమానవీయ దృక్పథం వల్లనే బాధితులకు న్యాయం ఆలస్యంగా అందుతున్నదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో మరో నిందితుడు శశిసింగ్‌ను నిర్దోషిగా విడుదల చేసిన కోర్టు.. దోషిగా ఖరారైన కుల్దీప్ సెంగార్‌కు విధించాల్సిన శిక్షపై బుధవారం విచారణ జరుపనుంది. ఉన్నావ్ లైంగికదాడి కేసుతో సంబంధమున్న మరో నాలుగు కేసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments