Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫలించిన ప్లాస్మా థెరపీ... కోలుకున్న ఢిల్లీ వైద్యమంత్రి

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (09:50 IST)
కరోనా వైరస్ బారినపడిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తిరిగి కోలుకున్నారు. ఆయనకు చేసిన ప్లాస్మా థెరఫీ చికిత్స ఫలించడంతో ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి. 
 
ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరుగుతోంది. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించగా ప్లాస్మా థెరపీని చేయాలని అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. 
 
ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మాను సత్యేంద్ర జైన్ శరీరంలోకి వైద్యులు ఎక్కించారు. ఈ చికిత్స సత్ఫలితాలను ఇచ్చింది. ఆయనలో పెరిగిన యాంటీ బాడీలు వైరస్‌ను నిరోధించాయి. 
 
ప్రస్తుతం జైన్ చికిత్సకు స్పందిస్తున్నారని, మరో 24 గంటల పాటు జ్వరం, శ్వాస ఇబ్బందులు తలెత్తకుంటే, ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలిస్తామని వైద్య బృందాలు వెల్లడించాయి. తొలుత రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరిన ఆయనను, ఆపై మ్యాక్స్ హాస్పిటల్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments