Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో అగ్నిప్రమాదం.. షోరూమ్‌లో మంటలు..

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (13:48 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని లజపత్ నగర్ మార్కెట్లోకి ఓ షోరూమ్‌లో చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో భారీ మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు హుటాహుటిన దాదాపు 30 అగ్నిమాపక శకటాలు చేరుకున్నాయి. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, లజపత్ నగర్ సెంట్రల్ మార్కెట్లో, బ్లాక్ 1 వద్ద ఈ ప్రమాదం సంభవించింది. 
 
ఈ సమాచారం అందిన వెంటనే దాదాపు 30 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ ఇచ్చిన ట్వీట్‌లో, సెంట్రల్ మార్కెట్లోని ఓ బట్టల దుకాణంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మొత్తం 30 అగ్ని మాపక శకటాలతో మంటలను ఆర్పుతున్నట్లు తెలిపారు. ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకు సమాచారం లేదని తెలిపారు.
 
ఈ ప్రమాదంలో నాలుగు దుకాణాలు అగ్ని ఆహుతైనట్లు సమాచారం. ఓ నెల రోజులపాటు అమలైన అష్ట దిగ్బంధనం తర్వాత ఈ దుకాణాలను తెరిచారు. మంటలు భారీగా చెలరేగడంతో పెద్ద ఎత్తున పొగ, ధూళి మేఘాలు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments