Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నాపర్లుగా ఖాకీలు.. దొంగను కిడ్నాప్ చేసి రూ.3 లక్షల డిమాండ్

Webdunia
బుధవారం, 26 మే 2021 (19:47 IST)
సమాజంలో నేరాలు ఘోరాలు జరుగకుండా పహారా కాస్తూ, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కిడ్నాపర్లుగా మారిపోయారు. వారంతా ఓ దొంగను కిడ్నాప్ చేశారు. ఆ దొంగను వదిలిపెట్టేందుకు ఏకంగా రూ.3 లక్షలను డిమాండ్ చేశారు. డబ్బు సంపాదన ఆశలో పడి ఈ నేరానికి పాల్పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీలోని జామియా నగర్ పోలీస్ స్టేషనులో దారి దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అతడిని విడిపించిన పోలీసులు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. 
 
అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏకంగా ఓ కిడ్నాప్‌కు ప్లాన్ చేశారు. తాము రక్షించిన దొంగను కిడ్నాప్ చేసి.. అతడిని పోలీస్ స్టేషన్‌లోనే దాచి పెట్టారు. అతడిని విడిచిపెట్టాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
 
ఈ కిడ్నాప్ ఉదతంపై దొంగ కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ విచారణలో దొంగను పోలీస్ స్టేషనులోనే దాచిపెట్టినట్టు గుర్తించారు. ఈ కేసులో రాకేష్ కుమార్ అనే హెడ్ కానిస్టేబుల్‌తో పాటు మరో ఇద్దరు ఇందులో కీలక నిందితులుగా ఉన్నారు. దీనిపై దీంతో వారు ముగ్గురినీ విధుల నుంచి తొలిగించారు. అలాగే, వారిని అరెస్టు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments