Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింతగా కొట్టుకోండి.. ఒకరిని ఒకరు అంతం చేసుకోండి.. 'ఇండియా'పై సీఎం ఒమర్ ట్వీట్

ఠాగూర్
ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (15:51 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తనదైనశైలిలో స్పందించారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 23 యేళ్ల తర్వాత అధికారాన్ని కైవసం చేసుకుంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ఓటర్లు కర్రుకాల్చివాతపెట్టారు. ఇక ఒకపుడు ఢిల్లీ పీఠాన్ని శాంసించిన కాంగ్రెస్ పార్టీ సోదిలో కూడా లేకుండా పోయింది. 
 
మొత్తం 70 స్థానాలకుగాను బీజేపీ 48, ఆప్ 22 స్థానాలను దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకి ముచ్చటగా మూడోసారి కూడా ఒక్క సీటు కూడా రాలేదు. ఈ ఫలితాలపై జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిలోని వివిధ రాజకీయ పార్టీల నేతలను ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేశారు. 
 
"మీకు నచ్చినట్టుగా మరింతగా కొట్టుకోండి. ఒకరిని ఒకరు అంతం చేసుకోండి. మిగిలిన రాష్ట్రాలను కూడా బీజేపీ తన్నుకుపోతుంది" అంటూ చురక అంటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అప్, కాంగ్రెస్ పార్టీలు అనుసరించిన తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఓ మీమ్‌ను జోడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments