Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దఫా కూడా హస్తినలో దీపావళిని నిశ్శబ్ధంగా జరుపుకోవాల్సిందే... (video)

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (13:21 IST)
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఇది ఆందోళనకరస్థాయికి చేరుకుంది. ఇది దీపావళిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో టపాసుల పేల్చితే కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా మందలించింది. ఈ ఆంక్షలు ఈ యేడాది కూడా అమలుకానున్నాయి. 
 
ఢిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు ఆప్ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం కఠినమైన ఆంక్షలు కూడా విధిస్తుంది. ఈ క్రమంలో గత యేడాది మాదిరే ఈ సారి కూడా దీపావళి సమయంలో టపాసులను కేజ్రీవాల్ ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది.
 
టపాసులపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. జవనరి 1వ తేదీ వరకు నిషేధం అమల్లో ఉంటుందని ఆయన చెప్పారు. ఈసారి టపాసుల ఆన్‌లైన్ విక్రయాలపై కూడా నిషేధం విధించామని తెలిపారు. 
 
అన్ని రకాల టపాసుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తున్నామని చెప్పారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి నిషేధం విధించక తప్పదని ఆయన అన్నారు. 
 
నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా టపాసులను పేల్చితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు, టపాసులపై నిషేధం విధించడంతో పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments