Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెక్‌డొనాల్డ్ ఫ్రెంచ్ ఫ్రైస్‌ లాగించిన తల్లీకూతుళ్లు.. మధ్యలో బల్లి డీప్ ఫ్రై.. కనిపించేసరికి?

అమెరికాలోని కాలిఫోర్నియా కేఎఫ్‌సీ చికెన్ ఆర్డర్ చేస్తే చికెన్ ముక్క ఎలుక ఆకారంలో ఉండటం.. అచ్చం ఎలుక మాదిరి ఉన్న సదరు ఫోటో సోషల్ మీడియాలోనే కాదు.. పలుదేశాల్లో సంచలనం సృష్టించింది.

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (09:24 IST)
అమెరికాలోని కాలిఫోర్నియా కేఎఫ్‌సీ చికెన్ ఆర్డర్ చేస్తే చికెన్ ముక్క ఎలుక ఆకారంలో ఉండటం.. అచ్చం ఎలుక మాదిరి ఉన్న సదరు ఫోటో సోషల్ మీడియాలోనే కాదు.. పలుదేశాల్లో సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా కేఎఫ్సీ కిందామీదా పడింది. అసలీ వ్యవహారానికి కారణమైన కస్టర్ డిక్సన్ను కలిసేందుకు కేఎఫ్సీ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తాజాగా అతని లాయర్ ఆ మాంసం ముక్కను ఓ ల్యాబ్కు అందించారు. అయితే.. సదరు ల్యాబ్ వారి నివేదిక ప్రకారం.. అది ఎలుక మాంసం కాదని.. చికెన్ ముక్కేనని తేల్చారు. దీంతో ఆ వివాదం సద్దుమణిగింది. 
 
కానీ భారత్‌లో తాజాగా మెక్‌డొనాల్డ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు చిక్కొచ్చిపడింది. కోల్‌కతాలో నివసించే ప్రియాంక అనే మహిళ తన కుమార్తెను వెంటబెట్టుకుని ఫాస్ట్‌పుడ్‌ తినడానికి మెక్‌డొనాల్డ్‌ ఔట్‌లెట్‌కు వెళ్లింది. అక్కడ ఫ్రెంచ్ ఫ్రై ఆర్డరిచ్చి.. వచ్చాక హ్యాపీగా లాగించేశారు. అయితే ఇద్దరు తింటుండగా.. ప్రియాంక కుమార్తె.. ఆహారంలో బాగా ఫ్రై అయిపోయిన బల్లిని గుర్తించింది.
 
గర్భవతి అయిన ప్రియాంక.. ఆ బల్లిని చూడగానే వాంతులు చేసుకున్నారు. మేనేజర్‌కు చెబితే ఆయన సింపుల్‌గా సారీ చెప్పారు. దీంతో కోపంతో ఊగిపోయిన ప్రియాంక.. బల్లిని ఫోటో తీసి..పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు కూడా మెక్‌డొనాల్డ్‌ సంస్థపై కేసు నమోదుచేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం