Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాలకు గుడ్‌బై చెప్తా : దగ్గుబాటి పురంధేశ్వరి ఎఫ్‌బి పోస్ట్

భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి వైకాపాలో చేరనున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అధికార ప్రతినిధి దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే రా

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (09:21 IST)
భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి వైకాపాలో చేరనున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అధికార ప్రతినిధి దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే రాజకీయాల నుంచి తప్పుకుంటామేగానీ... మరో పార్టీలో చేరే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. 
 
పురంధేశ్వరి త్వరలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని, వైఎస్సార్సీపీలో చేరుతున్నారనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ తరుణంలో పురంధేశ్వరి తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా స్పందించారు.
 
‘సామాజిక మాధ్యమాలు బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తుండటం చాలా బాధాకరమన్నారు. తాను పార్టీ మారుతున్నాననే వదంతులు నన్ను చాలా కలచి వేశాయని చెప్పారు. ప్రతి ఒక్కరిని, వారి మనోభావాలను గౌరవిస్తున్నాను. అదే సమయంలో, నేను చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెబుతున్నట్టు గుర్తు చేశారు. 
 
తాను ఇకపై బీజేపీలోనే నేను కొనసాగుతాను. ఒకవేళ, ఆ పార్టీలో కొనసాగలేని పరిస్థితులు తలెత్తితే, రాజకీయాల నుంచి తప్పుకుంటాను. నా తండ్రి, నా భర్త రాజకీయ విలువలు నేర్పించారు, అదే బాటలో నేను కొనసాగుతున్నాను అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments