Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇడుక్కి ఘటన.. 54కి చేరిన మృతుల సంఖ్య.. 16మంది గల్లంతు

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (15:35 IST)
Edukki
కేరళ రాష్ట్రంలో ఇడుక్కిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ వుంది. ఈ ఘటనలో మొత్తం మృతుల సంఖ్య 54కి చేరింది. ఈ ప్రమాదం అనంతరం గల్లంతైన వారిలో మరో 16మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ నెల 8న ఇడుక్కి జిల్లాలోని రాజమల ఏరియాలో కొండచరియలు విరిగిపడటంతో పలువురు ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. 
 
అప్పటి నుంచి అక్కడ ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నా కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. తాజాగా బుధవారం మరో రెండు మృతదేహాలను వెలికి తీయడంతో ఆ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 54కు చేరింది.
 
ఇదిలా ఉండగా మృతుల బంధువులకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేసి, జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మరణించిన వారి బంధువులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆయా ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments