Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడ్సు రైలును ఢీకొన్న మైసూర్ - దర్బంగా ఎక్స్‌ప్రెస్... మంటల్లో 2 బోగీలు..

ఠాగూర్
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (21:47 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా కవరైపేటలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మైసూరు నుంచి దర్బంగాకు వెళుతున్న (12578) ఎక్స్‌ప్రెస్ రైలు... పట్టాలపై ఆగివున్న గూడ్సు రైలును ఢీకొట్టింది. దీంతో రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. మైసూర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం వివరాలు తెలియాల్సివుంది. 
 
తిరువళ్లూరు సమీపంలోని కావరైపేట వద్ద ఆగి ఉన్న గూడ్సు రైలును ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు బోగీల్లో మంటలు చెలరేగినట్లు సమాచారం. మైసూరు - దర్భంగా మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ పట్టాలపై ఆగివున్న సరకు రవాణా రైలును అతి వేగంతో వచ్చిన ఎక్స్‌ప్రెస్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనలో పలు బోగీలు పట్టాలు తప్పగా.. రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో అనేక మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. మృతులు కూడా ఉండే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments