Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.1500 అప్పు.. వడ్డీ ఇచ్చినా వదల్లేదు.. వివస్త్రను చేసి.. నోటిలో మూత్రం పోశారు..

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (21:35 IST)
పాట్నా, ఖుస్రుపూర్ నగరంతో బీహార్ రాష్ట్ర రాజధాని. ఇక్కడి మోషింపూర్ గ్రామంలో నివసిస్తున్న ఓ దళిత మహిళ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కొద్ది నెలల క్రితం డబ్బుల కొరతతో అదే పట్టణానికి చెందిన ప్రమోద్ సింగ్ వద్ద రూ.1500 అప్పుగా తీసుకుంది. 
 
వడ్డీతో పాటు రుణాన్ని పూర్తిగా చెల్లించింది. కానీ ప్రమోద్, అతని కుమారుడు అన్సు సింగ్ ఇద్దరూ దళిత మహిళకు ఎక్కువ వడ్డీ చెల్లించాలని పట్టుబట్టారు. అయితే ఆ మహిళ నిరాకరించింది. ఒకానొక సమయంలో, ప్రమోద్ సింగ్ తనకు డబ్బు ఇవ్వకపోతే ఆ మహిళను బట్టలు విప్పి పట్టణం చుట్టూ తిరిగేలా చేస్తానని బెదిరించాడు. దీంతో ఆ మహిళ ఖుస్రుపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ప్రమోద్ విచారణకు పిలిచారు. 
 
దీంతో నిన్నగాక మొన్న ప్రమోద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఈ ఘటనతో ఆవేశానికి ప్రమోద్ తన స్నేహితులతో కలిసి అదేరోజు రాత్రి మహిళ ఇంటికి వెళ్లి ఆమెను కిడ్నాప్ చేసి బలవంతంగా తన ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆమెపై దాడి చేసి, బట్టలు విప్పి అవమానించాడు. 
 
దీంతో కోపోద్రిక్తుడైన ప్రమోద్ తన కొడుకును పిలిచి మహిళ నోటిలో మూత్రం పోశాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న మహిళ జరిగిన విషయాన్ని బంధువులకు చెప్పింది. దీంతో వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ మహిళను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసు అధికారి సియారామ్ యాదవ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

Jayam Ravi: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రవి ప్రేయసి సింగర్ కెనిషా బికినీ ఫోటోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments