Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో.. వడగండ్ల వాన?

జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన కారణంగా.. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉత్

Webdunia
శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (12:29 IST)
జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన కారణంగా.. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉత్తర జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన కారణంగా శనివారం విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, పెనుగాలులు వీస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. 
 
దక్షిణ మహారాష్ట్ర నుంచి మరాట్వాడా మీదుగా విదర్భ వరకూ కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్ర విభాగం అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోను తేలికపాటి జల్లులు కురుస్తాయని చెప్పారు. 
 
ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో వడగండ్ల వాన కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఒంటిమిట్ట శ్రీరామాలయంలో రాములోరి కల్యాణోత్సవం సందర్భంగా భారీగా కురిసిన వడగండ్ల వానలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments