Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా అంతానికి సమయం సమీపిస్తుంది : డాక్టర్ సమీరన్ పాండా

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (16:05 IST)
భారత్‌తో పాటు అనేక ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి ఈ యేడాది మార్చి మూడో వారానికి అంతం కావొచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్స్ (ఐసీఎంఆర్) ఎపిడెమాలజిస్ట్ చీఫ్ డాక్టర్ సమీరన్ పాండా అంచనా వేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే మార్చి 11వ తేదీ నాటికి ఈ వైరస్ అంతం కావొచ్చని తెలిపారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తిపై దేశ ప్రజలు సాగిస్తున్న పోరాటాన్ని ఇదేవిధంగా మరికొంత కాలం కొనసాగించినట్టయితే మార్చి 11వ తేదీ తర్వాత ఈ వైరస్ అంతులేకుండా పోతుందన్న నమ్మకం ఉందన్నారు. అయితే, ఈ మధ్యలో కొత్త కరోనా వైరస్ వేరియంట్లు పుట్టుకురాకుండా ఉండాలన్నారు. మార్చి 11వ తేదీ నాటికి ఈ కరోనా వైరస్ సాధారణ ఫ్లూ (ఎండమిక్)గా మారిపోతుందన్నారు. 
 
డెల్టా వైరస్ స్థానాన్ని ఒమిక్రాన్ వైరస్ భర్తీ చేసి, అపుడు మరో కొత్త రకం వైరస్ రాకపోతే కరోనా ఎండమిక్‌గా మారిపోయేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. తమ అంచనా మేరకు ఒమిక్రాన్ వైరస్ మూడు నెలలో పాటు ఉంటుందని తెలిపారు. ఈ వైరస్ మన దేశంలో డిసెంబరు 11వ తేదీన వెలుగు చూసిందని, అంటే మార్చి 11వ తేదీ తర్వాత అంతం కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments