Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా

Advertiesment
Telangana
, బుధవారం, 19 జనవరి 2022 (15:05 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఆయనకు నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ నిర్ధారణ అయినట్టు తేలింది. ఉమ్మడి వరంగల్ పర్యటనలో మంత్రి వెంట ఉన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, ఆయన భార్య, జెడ్పీ ఛైర్మన్ గండ్ర జ్యోతి, మరికొందరు జిల్లా వ్యవసాయ అధికారులతో కలిసి పంట నష్టాన్ని అంచనా వేశారు. 
 
వీరిలో గండ్రా వెంకటరమణా రెడ్డి దంపతులకు కోవిడ్ సోకింది. ఈ క్రమంలో వారితో కలిసి తిరిగిన మంత్రి నిరంజన్ రెడ్డికి కూడా ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో తనతో కాంటాక్ట్ అయినవారు విధిగా కోవిడ్ పరీక్షలు చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. 
 
కరోనా అంతానికి సమయం సమీపిస్తుంది
భారత్‌తో పాటు అనేక ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి ఈ యేడాది మార్చి మూడో వారానికి అంతం కావొచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్స్ (ఐసీఎంఆర్) ఎపిడెమాలజిస్ట్ చీఫ్ డాక్టర్ సమీరన్ పాండా అంచనా వేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే మార్చి 11వ తేదీ నాటికి ఈ వైరస్ అంతం కావొచ్చని తెలిపారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తిపై దేశ ప్రజలు సాగిస్తున్న పోరాటాన్ని ఇదేవిధంగా మరికొంత కాలం కొనసాగించినట్టయితే మార్చి 11వ తేదీ తర్వాత ఈ వైరస్ అంతులేకుండా పోతుందన్న నమ్మకం ఉందన్నారు. అయితే, ఈ మధ్యలో కొత్త కరోనా వైరస్ వేరియంట్లు పుట్టుకురాకుండా ఉండాలన్నారు. మార్చి 11వ తేదీ నాటికి ఈ కరోనా వైరస్ సాధారణ ఫ్లూ (ఎండమిక్)గా మారిపోతుందన్నారు. 
 
డెల్టా వైరస్ స్థానాన్ని ఒమిక్రాన్ వైరస్ భర్తీ చేసి, అపుడు మరో కొత్త రకం వైరస్ రాకపోతే కరోనా ఎండమిక్‌గా మారిపోయేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. తమ అంచనా మేరకు ఒమిక్రాన్ వైరస్ మూడు నెలలో పాటు ఉంటుందని తెలిపారు. ఈ వైరస్ మన దేశంలో డిసెంబరు 11వ తేదీన వెలుగు చూసిందని, అంటే మార్చి 11వ తేదీ తర్వాత అంతం కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కవిత, దామోదర్ రెడ్డి ప్రమాణం