Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో రెండు వారాల పాటు లాక్ డౌన్.. 24 కేసుల్లో 34వేల కేసులు

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (17:02 IST)
దేశంలో కరోనా కట్టడి కోసం మరో రాష్ట్రం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. కర్ణాటకలో మంగళవారం నుంచి రెండు వారాల పాటు లాక్‌డౌన్ విధించారు. గడిచిన 24 గంటల్లో ఏకంగా 34 వేల కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి 14 రోజుల పాటు రాష్ట్రంలో కొవిడ్ కర్ఫ్యూ విధిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప వెల్లడించారు. ఈ సందర్భంగా క్లోజ్ డౌన్ అనే పదం ఆయన వాడారు.
 
ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర వస్తువుల దుకాణాలకు అనుమతి ఇచ్చారు. కర్ఫ్యూ సమయంలో ప్రజా రవాణా ఉండదని కూడా స్పష్టం చేశారు. కేవలం నిర్మాణ, తయారీ, వ్యవసాయ రంగ పనులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఎమర్జెన్సీ అయితే తప్ప రాష్ట్రంలో కానీ, ఇతర రాష్ట్రాలకు కానీ ప్రయాణాలను అనుమతించరు.
 
ప్రజలు దీనికి సహకరించాలని, అలా అయితేనే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలగని యడ్యూరప్ప అన్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కూడా చెప్పారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments