Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో రెండు వారాల పాటు లాక్ డౌన్.. 24 కేసుల్లో 34వేల కేసులు

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (17:02 IST)
దేశంలో కరోనా కట్టడి కోసం మరో రాష్ట్రం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. కర్ణాటకలో మంగళవారం నుంచి రెండు వారాల పాటు లాక్‌డౌన్ విధించారు. గడిచిన 24 గంటల్లో ఏకంగా 34 వేల కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి 14 రోజుల పాటు రాష్ట్రంలో కొవిడ్ కర్ఫ్యూ విధిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప వెల్లడించారు. ఈ సందర్భంగా క్లోజ్ డౌన్ అనే పదం ఆయన వాడారు.
 
ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర వస్తువుల దుకాణాలకు అనుమతి ఇచ్చారు. కర్ఫ్యూ సమయంలో ప్రజా రవాణా ఉండదని కూడా స్పష్టం చేశారు. కేవలం నిర్మాణ, తయారీ, వ్యవసాయ రంగ పనులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఎమర్జెన్సీ అయితే తప్ప రాష్ట్రంలో కానీ, ఇతర రాష్ట్రాలకు కానీ ప్రయాణాలను అనుమతించరు.
 
ప్రజలు దీనికి సహకరించాలని, అలా అయితేనే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలగని యడ్యూరప్ప అన్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కూడా చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments