Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రేటర్ చెన్నై పరిధిలో లాక్డౌన్.. కఠిన ఆంక్షలతో 19 నుంచి అమలు!

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (16:26 IST)
దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర రాజధాని చెన్నైలో ఈ కేసులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దీంతో ఈ నెల 19వ తేదీ నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కంప్లీట్ లాక్డౌన్ ఈ నెల 19వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఇది గ్రేటర్ చెన్నై పరిధిలోకి వచ్చే చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ అమలుకానుంది. 
 
ఈ లాక్డౌన్ సమయంలో ఆటోలు, టాక్సీలు, ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. ఎమర్జెన్సీ అయితే, మినహా ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. లాక్డౌన్ విధిస్తున్న ఈ నాలుగు జిల్లాల్లో నిబంధనలు మరింత కఠినతరం చేయాలని తమిళనాడు ప్రభుత్వం సర్కారు నిర్ణయించింది. అలాగే, ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని రకాల సడలింపులను రద్దు చేయనున్నారు. 
 
కిరాణా సరకుల, కూరగాయల దుకాణాలు మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరిచివుంచనున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిళ్లకు మాత్రమే అనుమతిస్తున్నారు. కాగా, ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో 42,607 మందికి కరోనా సోకింది. 23409 మంది కోలుకున్నారు. 397 మంది చనిపోయారు. గ్రేటర్ చెన్నై పరిధిలో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 

సంబంధిత వార్తలు

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments