Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకేసారి నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (13:31 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది కరోనా బాధితురాలు. ఈ ఘటన గోరఖ్‌పూర్‌ బీఆర్‌డీ మెడికల్‌ కళాశాలలో చోటుచేసుకుంది. నవజాతి శిశువుల్లో ముగ్గురు ఆరోగ్యంగా ఉన్నారని, నాలుగో శిశువుని వెంటిలేటర్‌పై ఉంచినట్లు వైద్యులు వివరించారు. 
 
అలాగే నలుగురికి జన్మనిచ్చిన తల్లి కూడా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే నెలలు నిండకముందే డెలివరీ అయినట్లు వైద్యులు చెప్పారు. నలుగురు చిన్నారులు 900 గ్రాముల నుంచి 1.5 కిలోల వరకు ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.
 
ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తాయని బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ గణేష్‌ తెలిపారు. నలుగురు పిల్లల నుంచి శాంపిల్స్‌ సేకరించి కరోనా పరీక్షల కోసం మైక్రో బయోలజీ డిపార్టుమెంట్‌కు పంపినట్లు తెలిపారు. 
 
కాగా, దేవరియా జిల్లాలోని గౌరీ బజార్‌లో ఉంటున్న 26 మహిళ మంగళవారం రాత్రి మెడికల్‌ కాలేజీలోని ట్రామా సెంటర్‌లో కరోనా పరీక్షలు చేయించుకుంది. ఈ పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌ వచ్చింది. మహిళ డెలివరికి ఉండటంతో వైద్య బృందం మెరుగైన చికిత్స అందించారు. బుధవారం నలుగురు పిల్లలకు జన్మనించ్చిందని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments