Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కులను తప్పనిసరి చేస్తున్న రాష్ట్రాలు.. కర్నాటక - తమిళనాడులో ఆదేశాలు

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (19:49 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలకు పలు రాష్ట్రాలు అపుడే ఉపక్రమిస్తున్నాయి. కేంద్ర సూచనలతో ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ఇందులోభాగంగా, పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షలను అమల్లోకి తెస్తున్నాయి. ఒమిక్రాన్ బీఎఫ్7 సబ్ వేరియంట్‌తో ముప్పు ఉందన్న నిపుణులతో హెచ్చరికలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో కర్నాటక, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు మళ్లీ తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా, విద్యా సంస్థల్లో మాస్కును తప్పనిసరి చేసింది. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కర్నాటక ఆరోగ్య శాఖ కేశవ సుధాకర్ వెల్లడించారు. అలాగే, తమిళనాడు ప్రభుత్వం కూడా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాస్కు ధరించడాన్ని తప్పనిసరిచేసింది. 
 
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్‌లు రెస్టారెంట్లు, బార్లలో ఖచ్చితంగా మాస్కులు ధరించాలని, కొత్త సంవత్సర వేడుకలు రాత్రి ఒంటిగంట లోపే ముగించాల్సి ఉంటుందని కర్నాటక ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ వేడుకలు జరిగే చోట పరిమితి మించి జనం గుమికూడరాదని తెలిపింది. అదేసమయంలో కరోనా పరిస్థితులపై ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments