Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదాలు సరే.. ఈ ఈడ్చుకెళ్లడాలేంటి..? దంపతుల మృతి

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (09:45 IST)
రోడ్డు ప్రమాదాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి. అయితే తాజాగా రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న వారిని వాహనాలతో ఈడ్చుకెళ్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా కోయంబత్తూరు జిల్లాలో సైకిల్‌పై వెళ్తున్న జంటను బస్సు ఢీకొని ఈడ్చుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయారు.
 
వివరాల్లోకి వెళితే.. రాజేంద్రన్ కోయంబత్తూరు జిల్లా కల్లిపాళయం ప్రాంతానికి చెందినవాడు. అతని భార్య దేవి. వీరిద్దరూ పూలువపట్టి మున్సిపల్ కార్యాలయంలో తాత్కాలిక క్లీనర్లుగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. 
 
ఈ నేపథ్యంలో వీరిద్దరూ సైకిల్‌పై పనికి వెళ్తున్నారు. అంతలో వెనుకగా వచ్చిన ప్రభుత్వ బస్సు వారిని ఢీకొంది దీంతో వారిద్దరూ కిందపడిపోయారు. వీరిపై నుంచి బస్సు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వారి మృతదేహాలు బస్సులో చిక్కుకుని, బస్సు ఆగకముందే కొన్ని మీటర్లు ఈడ్చుకెళ్లడం జరిగింది. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దంపతుల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రభుత్వ బస్సు డ్రైవర్ లొంగిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments