కులాలే ముఖ్యం.. కుంభమేళాలు, దేవాలయాలు తిండిపెడతాయా?

Webdunia
మంగళవారం, 1 జనవరి 2019 (18:07 IST)
రాజస్థాన్‌లో మంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాను తన కులం కోసం పనిచేసేందుకే తొలి ప్రాధాన్యత ఇస్తానని మహిళా, శిశు సంక్షేమ మంత్రి మమతా భూపేశ్ పేర్కొన్నారు. 
 
అల్వార్ జిల్లా రేణి పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమలో ఆమె మాట్లాడుతూ.. తన కులానికి చెందిన ప్రజల అభివృద్ధి కోసమే ముందు పనిచేస్తానన్నారు. తర్వాతే సమాజం గురించి ఆలోచిస్తానని తెలిపారు. అయితే అందరికోసం పనిచేయడమే తన ఉద్దేశమంటూ క్లారిటీ ఇచ్చారు. 
 
మరోవైపు ఒకవైపు తాము ఉద్యోగాలు, హక్కుల కోసం పోరాడుతోంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళాలు, దేవాలయాలు అంటూ కోట్లు కుమ్మరిస్తోందంటూ మాజీ బీజేపీ నేత సావిత్రిబాయి పూలే అన్నారు. 
 
గుళ్లు, గోపురాల వంటివి కాకుండా రాజ్యాంగాన్ని అమలు చేస్తే దేశ ప్రగతిలో మార్పు వస్తుందని ఆవిడ అన్నారు. కుంభమేళాలు, దేవాలయాలు దళిత, గిరిజన, ముస్లింలకు ఏమన్నా తిండి పెడతాయా? ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. 
 
కోట్ల డబ్బును వృధా చేస్తున్నారు. దేశం దేవుడితో కానీ దేవాలయంతో కానీ పాలించబడదు. దేశాన్ని పాలించేది రాజ్యాంగం అని సావిత్రిబాయి అన్నారు. అంతే కాకుండా ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల విషయమై ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌పై సావిత్రిబాయి మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments