Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కరోనా వైరస్' సోకకుండా ఉండాలంటే.. అదొక్కటే మార్గం...

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (09:35 IST)
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ మహమ్మారి కమ్మేస్తోంది. ఇందులో మన దేశం కూడా ఉంది. దీంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వైరస్ బారినపడి అనేక మంది కోలుకున్నారు. ఇలా కోలుకున్న వారిలో ముంబై నగరంలోని ఘట్‌కోపర్ ప్రాంతానికి చెందిన అంజనీభాయి ఒకరు. ఈమె వయసు 65 యేళ్లు. కరోనా వైరస్ సోకడంతో మార్చి 17వ తేదీన ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ ఐసోలేషన్ వార్డులో ఉంచి కరోనా చికిత్స చేయించుకున్నారు. ఈ చికిత్స ముగియడంతో పాటు.. కరోనా వైరస్ బారి నుంచి ఆమె పూర్తిగా విముక్తిపొందింది. దీంతో ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత కరోనా వైరస్ ఎలా సోకింది? ఆస్పత్రిలో చికిత్స ఎలా జరిగింది? ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే ఏం చేయాలి వంటి తదితర వివరాలను ఆమె వెల్లడించింది. 
 
తాను ముంబైలో ఉంటూ ఓ ఇంట్లో పని చేస్తాను. ఆ ఇంటి యజమాని అమెరికా నుంచి తిరిగి రావడంతో అతని వల్ల తనకు కరోనా సంక్రమించింది. కరోనా వచ్చినా ప్రజలు భయపడకుండా ధైర్యంగా ఉంటే అదే నయమవుతుంది. ప్రభుత్వం, పోలీసులు, వైద్యుల సూచనల ప్రకారం ఇంట్లో ఉండండి. రద్దీ ప్రదేశాలకు అస్సలు వెళ్లకూడదన్నారు. 
 
ఆసుపత్రిలో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తనకు చికిత్సచేశారని, దానివల్లనే తాను కోలుకున్నానని చెప్పారు. మీరు ప్రభుత్వ నియమాలను పాటిస్తే, కరోనావైరస్ దగ్గరకు రాదు. ముఖ్యంగా, లాక్‌డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళకే పరిమితం కావాలని అంజనీభాయి సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments