ఇటలీ నుంచి స్వదేశానికి భారతీయ విద్యార్థులు... తెలంగాణా స్టూడెంట్స్ విముక్తి కూడా...

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (12:41 IST)
గత వారం రోజులుగా ఇటలీలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు విముక్తి లభించింది. మొత్తం 85 మంది విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సోకిన దేశాల్లో ఇటలీ రెండో స్థానంలో ఉండగా, ఈ వైరస్ బారినపడి 17 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ దేశంలో చిక్కుకుని సాయం కోసం ఎదురు చూస్తూ పడిగాపులు కాస్తూ వచ్చిన భారతీయ విద్యార్థులకు ఇపుడు విముక్తి లభించింది. 
 
దీంతో ఇటలీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ మరింత ప్రబలకుండా చర్యలు తీసుకుంది. విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో స్వదేశానికి వచ్చేందుకు టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ విమాన సర్వీసులు రద్దు కావడంతో పావియా పట్టణంలో చిక్కుకున్న 85 మంది భారత విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.
 
ఈ పరిస్థితి మరింత విషమించకముందే భారత ప్రభుత్వం తమకు సాయం అందించి స్వదేశం రప్పించే ఏర్పాట్లు చేయాలని బాధిత విద్యార్థుల్లో ఒకరైన బెంగళూరుకు చెందిన అంకిత ప్రభుత్వాన్ని అర్థించింది. ఫలితంగా ఇటలీలో చిక్కుకున్న 85 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చారు. వీరిలో 25 మంది తెలంగాణ విద్యార్థులు కాగా, 20 మంది కర్ణాటక, 17 మంది కేరళ, కర్నాటక, ఢిల్లీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments