దేశంలో కరోనా వైరస్ విజృంభణ.. 487మంది మృతి

Webdunia
గురువారం, 9 జులై 2020 (11:33 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24గంటల్లో కొత్తగా 24,879 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దేశంలో తొలిసారిగా ఒక్కరోజే దాదాపు 25వేల మార్కు దగ్గరకు చేరింది. 
 
దీంతో గురువారం నాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 7,67,296కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతేకాకుండా వైరస్ బాధితుల్లో బుధవారం ఒక్కరోజే 487మంది మృత్యవాతపడ్డారు. దీంతో దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య 21,129కి చేరింది.  
 
అలాగే మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్రలో 6603 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో మొత్తం బాధితుల సంఖ్య 2,23,724గా నమోదైంది. వీరిలో ఇప్పటి వరకు 9448 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తమిళనాడులో బుధవారం ఒక్కరోజే 3756 కేసులు బయటపడటంతో మొత్తం కేసుల సంఖ్య 1,22,350కు చేరింది. వీరిలో 1700మంది మృత్యువాతపడ్డారు. 
 
ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఢిల్లీలో కొత్తగా 2033 కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 1,04,864కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3213మంది మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

కపుల్స్ సొసైటీ నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్న కథతో సంతాన ప్రాప్తిరస్తు

Allari Naresh: 12A రైల్వే కాలనీ లో డిఫరెంట్ షేడ్స్ పాత్ర లో అల్లరి నరేష్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments