Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా కరాళనృత్యం.. రికార్డు స్థాయిలో 20,903 కేసులు

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (10:24 IST)
భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 20,903 కరోనా కేసులు నమోదయ్యాయి.
 
అలాగే కరోనా కారణంగా 379 మంది మరణించారు. దీంతో ‌భారత్‌‌లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,544కి చేరుకోగా మొత్తం మరణాల సంఖ్య 18,213గా ఉంది. ఇప్పటివరకు మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల్లో 2,27,439 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 3,79,891 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇకపోతే, దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. వైరస్ విజృంభణ మొదలైన తొలి రోజు నుంచి రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ ఇప్పుడిప్పుడే కనుమరుగయ్యే పరిస్థితి కనిపించటం లేదు. అందువల్ల వైరస్ భారీన పడకుండా ఉండాలంటే భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments