Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా.. గడిచిన 24 గంటల్లో 9985 కేసులు

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (10:45 IST)
చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాపించిన కరోనాతో భారతదేశం కూడా హడలిపోతుంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో భారత్‌లో గడిచిన 24 గంటల్లో 9985 మందికి కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం (జూన్ 10,2020) వెల్లడించింది. 
 
వీరిలో 24 గంటల్లోనే 279 మంది కూడా మృతి చెందినట్లు తెలిపింది. ఫలితంగా దేశవ్యాప్తంగా మొత్తం వైరస్‌ కేసుల సంఖ్య 2 లక్షల 76 వేల 583లకు చేరుకుంది. దీంట్లో 1 లక్షా 33వేల 632 కేసులు యాక్టివ్‌గా ఉండగా..1 లక్షా 35వేల 206 కేసులు రికవర్‌ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
అలాగే దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 7,745 వేలుగా ఉందని ప్రభుత్వం వెల్లడించింది. కాగా..కరోనా వైరస్‌ శ్యాంపిల్‌ పరీక్షలు దేశంలో 50 లక్షలు దాటినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. గత 24 గంటల్లో దేశంలో 1 లక్షా 42వేల 216 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించామని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments