Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా.. గడిచిన 24 గంటల్లో 9985 కేసులు

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (10:45 IST)
చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాపించిన కరోనాతో భారతదేశం కూడా హడలిపోతుంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో భారత్‌లో గడిచిన 24 గంటల్లో 9985 మందికి కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం (జూన్ 10,2020) వెల్లడించింది. 
 
వీరిలో 24 గంటల్లోనే 279 మంది కూడా మృతి చెందినట్లు తెలిపింది. ఫలితంగా దేశవ్యాప్తంగా మొత్తం వైరస్‌ కేసుల సంఖ్య 2 లక్షల 76 వేల 583లకు చేరుకుంది. దీంట్లో 1 లక్షా 33వేల 632 కేసులు యాక్టివ్‌గా ఉండగా..1 లక్షా 35వేల 206 కేసులు రికవర్‌ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
అలాగే దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 7,745 వేలుగా ఉందని ప్రభుత్వం వెల్లడించింది. కాగా..కరోనా వైరస్‌ శ్యాంపిల్‌ పరీక్షలు దేశంలో 50 లక్షలు దాటినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. గత 24 గంటల్లో దేశంలో 1 లక్షా 42వేల 216 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించామని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments