Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా.. గడిచిన 24 గంటల్లో 9985 కేసులు

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (10:45 IST)
చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాపించిన కరోనాతో భారతదేశం కూడా హడలిపోతుంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో భారత్‌లో గడిచిన 24 గంటల్లో 9985 మందికి కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం (జూన్ 10,2020) వెల్లడించింది. 
 
వీరిలో 24 గంటల్లోనే 279 మంది కూడా మృతి చెందినట్లు తెలిపింది. ఫలితంగా దేశవ్యాప్తంగా మొత్తం వైరస్‌ కేసుల సంఖ్య 2 లక్షల 76 వేల 583లకు చేరుకుంది. దీంట్లో 1 లక్షా 33వేల 632 కేసులు యాక్టివ్‌గా ఉండగా..1 లక్షా 35వేల 206 కేసులు రికవర్‌ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
అలాగే దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 7,745 వేలుగా ఉందని ప్రభుత్వం వెల్లడించింది. కాగా..కరోనా వైరస్‌ శ్యాంపిల్‌ పరీక్షలు దేశంలో 50 లక్షలు దాటినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. గత 24 గంటల్లో దేశంలో 1 లక్షా 42వేల 216 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించామని తెలిపింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments