Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ.. 671 మంది మృతి

Webdunia
శనివారం, 18 జులై 2020 (12:24 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన తరువాత నిత్యం రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 34,884 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 671 మంది మృత్యువాత పడ్డారు. 
 
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలు అయిన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్గం. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 10,38,716 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ఈ మహమ్మారి భారీన పడి 26,285 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఇక భారత్‌లో అత్యధిక కరోనా కేసులు మహరాష్ట్రలో నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు అక్కడ 2.84లక్షల కేసులు నమోదు కాగా.. 11,194 మంది మరణించారు. తమిళనాడులో 1.56లక్షల కేసులు నమోదు కాగా.. 2,236 ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో 1.19లక్షల కేసులు నమోదు కాగా.. 3,545 మంది చనిపోయారు. 
 
ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో. అమెరికా 36.8లక్షల కేసులతో మొదటి స్థానంలో ఉండగా.. బ్రెజిల్‌లో 20.6లక్షల కేసులతో రెండో స్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments