కరోనా ఉగ్రరూపం.. 24 గంటల్లో 1654 కేసులు.. మే నెల 31 వరకు లాక్ డౌన్

Webdunia
బుధవారం, 6 మే 2020 (10:43 IST)
కరోనా వైరస్ భారత దేశంలో తీవ్రరూపం దాల్చుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 1694 కేసులు నమోదవగా, 126 మంది మరణించారు. ఇప్పటివరకు కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,391కి చేరింది. వైరస్‌ ప్రభావంతో ఇప్పటివరకు 1694 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
కరోనా బారిన పడిన వారిలో 14,182 మంది బాధితులు కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా మరో 33,514 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో కోలుకుంటున్న వారు 28.71 శాతంగా ఉన్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,525కు చేసింది.
 
కాగా.. కేంద్రం వైరస్ విజృంభిస్తూ ఉండటంతో ఈ నెల 17 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం దేశవ్యాప్తంగా ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సడలింపులు ఇచ్చింది. కేంద్రం సడలింపులు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలతో పాటు ఇతర దుకాణాలు ప్రారంభం అయ్యాయి. 
 
మరోవైపు కేంద్రం మే నెల 31 వరకు లాక్ డౌన్‌ను పొడిగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కేంద్రం లాక్ డౌన్‌ను పొడిగించటానికే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అనేక రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల గురించి కేంద్రం ఆరా తీస్తోందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments