Webdunia - Bharat's app for daily news and videos

Install App

60వేల మందికి కరోనా.. ఒక్కరోజే 933మంది మృత్యువాత

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (11:00 IST)
కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా ఎన్నడూ లేనంతగా వరుసగా రెండో రోజూ 60 వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. శుక్రవారం ఒక్క రోజే దేశంలో కొత్తగా 61,537 మందికి కరోనా సోకడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,88,612కి చేరింది. అలాగే, రికార్డు స్థాయిలో ఒక్కరోజే 933మంది మృత్యువాత పడటంతో మొత్తం మృతుల సంఖ్య 42,518కి పెరిగింది. 
 
దేశంలో మరణాల రేటు ప్రస్తుతం 2.04%గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. మరోవైపు, కొవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 14లక్షలు దాటేసింది. ప్రస్తుతం రికవరీ అయిన వారి సంఖ్య 14,27,006గా ఉంది. దేశంలో ప్రస్తుతం 6,19,088 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. భారత్‌లో రికవరీ రేటు 68.32శాతంగా ఉంది.
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా పరీక్షలు విస్తృతంగా చేస్తున్నట్టు ఐసీఎంఆర్‌ తెలిపింది. నిన్న ఒక్క రోజే 5,98,778 శాంపిల్స్‌ పరీక్షించినట్టు వెల్లడించింది .దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 2,33,87,171 శాంపిల్స్‌ను పరీక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments