Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్టు : సింహం - పులి సంపర్కానికి బ్రేక్

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (13:04 IST)
కరోనా వైరస్ కేవలం మనుషులకే కాదు జంతువులకు కూడా సోకుతుంది. ఇటీవల న్యూయార్క్ నగరంలోని ఓ జంతు ప్రదర్శనశాలలో ఉండే ఓ పులికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆ జూ పార్కులోని జంతువులన్నింటినీ ఒకదానితో ఒకటి కలుసుకోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. 
 
ఇదే విధానాన్ని మన దేశంలోని జంతు ప్రదర్శనశాలల్లో కూడా అమలు చేస్తున్నారు. కరోనా వైరస్ భయంతో జంతు ప్రదర్శనశాలలో జంతువుల సంతానోత్పత్తికి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. అహ్మదాబాద్ నగరంలోని కమలానెహ్రూ జూలాజికల్ గార్డెన్‌లో ఉన్న పులులు, సింహాల జంటలు కలవకుండా దూరంగా ఉంచారు. 
 
జంతుప్రదర్శనశాలలో పులులు, సింహాల జంటల మధ్య సంతానోత్పత్తికి ఈ సీజన్ సరైన సమయం కావడంతో ఇవి కలిసేలా ఒకే గుహలో వదిలివేస్తుండటం సర్వసాధారణం. కాని కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పులులు, సింహాల జంటలు కలవకుండా ముందుజాగ్రత్త చర్యగా వాటిని వేర్వేరు గుహల్లో ఉంచామని జూ సూపరింటెండెంట్ భరత్ సిన్హా వివల్ చెప్పారు. 
  
జంతువుల జంటల మధ్య సంతానోత్పత్తిని నిలిపి వేయడంతో పాటు పశువైద్యాధికారుల బృందం నిత్యం వీటిని పరీక్షిస్తోంది. పులులు, సింహాల ప్రవర్తనలో ఏమైనా మార్పులు వచ్చాయా? వీటికి శ్వాసకోశ ఇబ్బందులున్నాయా? ముక్కు కారడం, దగ్గు సమస్యలున్నాయా అని పశువైద్యులు పరీక్షిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments