Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త... 3 నెలలు మేమే చెల్లిస్తాం!

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (12:54 IST)
దేశంలోని ఈపీఎఫ్ ఖాతాదారులకు చెప్పినట్టు పీఎఫ్ ఖాతాదారులకు కూడా కేంద్రం శుభవార్తను చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లోభాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో అత్యవసర సేవలు మినహా దేశం మొత్తం బంద్ అయింది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఇబ్బందిపడకుండా ఉండేందుకు వీలుగా పీఎఫ్ ఖాతా సొమ్ములో 40 శాత మేరకు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును ఇప్పటికే కల్పించింది. ఇపుడు తాజాగా మరో శుభవార్త చెప్పింది. పీఎఫ్‌ మొత్తం చెల్లింపునకు సంబంధించి కేంద్రం కార్మిక శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 
 
ఆయా పరిశ్రమలు, సంస్థల్లో పనిచేస్తూ పీఎఫ్‌ ఖాతాదారులుగా కొనసాగుతున్న వారి మూడు నెలల పీఎఫ్‌ మొత్తాన్ని కేంద్రం జమ చేస్తుందని, ఇందుకోసం ఎలక్ట్రానిక్‌ చలానా కమ్‌ రిటర్న్‌ (ఈసీఆర్‌) సమర్పించి డబ్బులు క్లెయిమ్‌ చేసుకోవాలని కార్మిక శాఖను ఆదేశించింది. 
 
లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమలు మూసివేత, కార్మికులకు వేతనాల కోత, ఉద్యోగాల నుంచి తొలగించడం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని మూడు నెలల పీఎఫ్‌ మొత్తాన్ని చెల్లించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. 
 
దీనివల్ల 79 లక్షల మంది ఖాతాదారులకు, 3.8 లక్షల చిన్న, సూక్ష్మ, పెద్ద సంస్థలకు ప్రయోజనం కలుగుతుంది. ఇందుకోసం కేంద్రంపై దాదాపు 4,800 కోట్ల రూపాయల భారం పడనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments