Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో కొత్తగా 874 కరోనా కేసులు.. 20వేల మార్కును దాటేసింది..!

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (19:34 IST)
కరోనా కేసులు తమిళనాడులో పెరిగిపోతున్నాయి. శుక్రవారం కొత్తగా 874 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. గత కొన్ని రోజుల నుంచి 700కి పైబడిన కేసులే రోజూ నమోదు అవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20వేల మార్కును దాటి 20 వేల 246కు చేరుకుంది. 
 
ఇప్పటివరకు 11,313 మంది వైరస్ బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. తమిళనాడులో ప్రస్తుతం 8,776 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక శుక్రవారం మరో తొమ్మిది మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 154కు చేరింది.
 
తమిళనాడులో శుక్రవారం నమోదైన 874 కరోనా కేసులలో 733 మంది తమిళనాడు నివాసితులే కావడం గమనార్హం. మిగతా 141 మంది వివిధ రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రానికి తిరిగొచ్చిన వారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. వారిలో మహారాష్ట్ర నుంచి 135 మంది, కేరళ నుంచి ముగ్గురు, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమబెంగాల్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments